వేద న్యూస్, జీడబ్ల్యుఎంసి :
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా అశ్విని తానాజీ వాకడే ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) గా విధులు నిర్వహిస్తున్న అశ్విని తానాజీ వాకడే ను బల్దియా కమిషనర్ గా బదిలీ చేశారు. ఈ మేరకు అశ్విని తానాజీ వాకడే జిడబ్ల్యుఎంసి కమిషనర్ గా గురువారం సాయంత్రం ప్రధాన కార్యాలయం లో బాధ్యతలు స్వీకరించారు.