వేద న్యూస్, వరంగల్:
బీఆర్ఎస్ వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ను కేటీఆర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షుడు, బీఆర్ఎస్ యువనేత మైనాల నరేశ్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నరేందర్ కు ఆయన పూల మొక్క అందజేశారు. .
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో గులాబీ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నరేశ్ కు సూచించారు. కేటీఆర్ సేన అధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా నరేశ్ కు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో భవిష్యత్తులో అధికారంలోకి రాబోయేది బీఆర్ఎస్ పార్టీనేనని ధీమా వ్యక్తం చేశారు.