• తండ్రి ఆస్తిలో వాటా కోసం                    కుమారుడి నిరాహార దీక్ష 

వేద న్యూస్, వరంగల్:

“రక్తం పంచుకు పుట్టిన తనయుడికి తండ్రి ఆస్తి దక్కకుండా కుటుంబీకులు అడ్డు పడుతుండడంతో.. ఆ ఇంటి వారసుడైన కుమారుడు న్యాయపోరాటం చేస్తున్నాడు. ఊరిలో టెంటు వేసుకొని నిరాహార దీక్ష చేస్తూ.. తనకు న్యాయం చేయాలని ఊరి ప్రజలను, పెద్ద మనుషులను కోరుతున్నాడు.”

స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ఎలుకుర్తి (హవేలీ) గ్రామానికి చెందిన మిట్టపల్లి శ్రీనివాస్ 17 ఏళ్ల క్రితం మృతి చెందారు. ఆయన కుమారుడైన మిట్టపల్లి అరవింద్ తన తల్లితో కలిసి ఇన్నాళ్లు తన అమ్మమ్మ ఇంటి వద్ద ఉన్నాడు. అయితే, ఈ సమయంలో తన నానమ్మ బాగోగుల నిమిత్తం ఊరికి వచ్చి పోతూ ఉండేవాడు. నాయనమ్మ బాగోగులను తల్లితో కలిసి అరవింద్ చూసుకోవడంతోపాటు.. నానమ్మ కాలం చేసిన సందర్భంగా కార్యక్రమాలన్నింటికీ హాజరయ్యాడు.

 అరవింద్ మేజర్ ( 18 ఏళ్లు) కాగానే ఆస్తిలో వాటా ఇస్తానని అరవింద్ నానమ్మ చెబుతూ ఉండేదని వెల్లడించారు. అరవింద్ నానమ్మ ఇటీవల మృతి చెందగా, అప్పటినుంచి తన ఆస్తివాటా కోసం వ్యవసాయ భూమి, ఇంటి వద్దకు వెళ్లగా, తన పెద్దనాన్న కరుణాకర్, బాబాయ్ రాజు.. గొడవకు దిగుతున్నారని పేర్కొన్నారు. “ఆస్తిలో వాటా లేదు ” అని హెచ్చరిస్తున్నారని వెల్లడించారు. 

తన తండ్రి మిట్టపల్లి సురేందర్ వాటాగా రావలసిన వ్యవసాయ భూమి, ఇంటి స్థలం తనకు ఇప్పించాలని అరవింద్ కోరుతున్నాడు. పెద్ద మనుషుల సమక్షంలో గతంలో మాట్లాడిన సందర్భంలో.. తనకు వాటాగా రావాల్సిన పావు తక్కువ మూడు ఎకరాలకు కాకుండా.. 30 గుంటలు, ఇంటి స్థలంలో ఐదు గంటలకు బదులుగా మూడు గుంటలు.. ఇస్తామన్నారని కానీ, ఇప్పుడు మాట మారుస్తూ అసలేం లేదని అంటున్నట్లుగా పేర్కొంటున్నారు.

న్యాయంగా తనకు రావలసిన ఆస్తి వాటాను ఇప్పించాలని బాధితుడు అరవింద్ గ్రామస్తులు, పెద్ద మనుషులను వేడుకుంటున్నాడు. ఆస్తి విషయమై తాను పెద్ద మనుషుల మధ్యకు పిలిపించినా, పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా…. తన పెదనాన్న, బాబాయ్ రావడం లేదని ఆరోపించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు కొందరు మాట్లాడుతూ.. న్యాయంగా మిట్టపల్లి వంశాన్ని మోస్తున్న అరవింద్ కు వాటా ఇవ్వాల్సిందేనని అభిప్రాయపడ్డారు. 

మిట్టపల్లి శ్రీనివాస్ మరణించిన సందర్భంలో ఆమె భార్య కడుపులో మూడు నెలల బాలుడుగా ఉన్న అరవింద్.. ఆ తర్వాత క్రమంలో బాలుడుగా పెరుగుతున్న సందర్భంలో.. తన నానమ్మ మాటలు నమ్మి.. పెద్దయ్యాక ఆస్తి వస్తుందని చిన్నప్పటి నుంచి వేచి చూస్తున్నాడని.. కానీ ఇప్పుడు ఆస్తి లేదని ఇవ్వబోమని, అరవింద్ పెదనాన్న, బాబాయ్ పేర్కొన్నడం సరికాదని చెబుతున్నారు.

న్యాయంగా అరవింద్, ఆయన తల్లి మిట్టపల్లి వంశాన్ని మోస్తున్నందున.. వారికి రావలసిన ఆస్తివాటా తప్పనిసరిగా వస్తుందని, న్యాయవ్యవస్థ సైతం అలానే చేస్తుందని నమ్మకం ఉందని కొందరు స్థానికులు పేర్కొంటున్నారు.

తన న్యాయమైన వాటా కోసం అరవింద్.. తన తల్లితో కలిసి టెంట్ వద్ద ఊరిలో.. నిరాహార దీక్షలు చేస్తుండడం.. చూస్తుంటే తమ గుండె తరుక్కుపోతున్నదని, రోజులుగా తిని తినక న్యాయం కోసం వారు పోరాడుతున్నారని చెబుతున్నారు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *