- మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్
వేద న్యూస్, మరిపెడ:
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్ డే)ను పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా పరిధిలో విద్యార్థినీ విద్యార్థులకు, యువతీ యువకులకు ఔత్సహిక ఫొటోగ్రాఫర్లకు ఫోటోగ్రఫీ, అదేవిధంగా షార్ట్ ఫిల్మ్ లకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర పోలీస్ ఆధ్వర్యంలో జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోటీలను నిర్వహిస్తున్నట్టు ఐపీఎస్ అధికారి, మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా.సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ తెలిపారు.
గురువారం ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. పోలీస్ అమరవీరుల ప్రాణత్యాగాలను స్మరిస్తూ ఈ నెల 21 నుంచి 31 వరకు వారోత్సవాలు నిర్వహించబడుతాయని, ఇందులో భాగంగా పోలీసుల త్యాగాలు, పోలీసు విధుల్లో ప్రతిభను తెలిపే విధంగా ఉండే ఈ మధ్య కాలంలో తీసిన (3) ఫొటోలు, తక్కువ నిడివి (3 నిమిషాలు) షార్ట్ ఫిలిమ్స్ తీసి రాష్ట్రస్థాయి పోటీల కోసం ఈనెల 22 లోపు మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సంబంధిత షార్ట్ ఫిల్మ్ లోడ్ చేసిన పెన్ డ్రైవ్, 10 x 8 సైజ్ ఫొటోలను మహబూబాబాద్ జిల్లా ఎస్పీ పీఆర్వోకు అందజేయాలని కోరారు.
ఈ పోటీలకు నామినేషన్లు పంపించే ఔత్సహికులు రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు, ఈవ్లీజింగ్, ర్యాగింగ్, కమ్యూనిటీ పోలీసింగ్, మూఢనమ్మాలు, ఇతర సామాజిక రుగ్మతలు. అత్యవసర సమయాల్లో పోలీసులు స్పందన, ప్రకృతి వైపరిత్యాల్లో పోలీసుల సేవ, ఇతర సంద ర్భాల్లో పోలీసుల కీర్తి ప్రతిష్టలను పెంపొందించే అంశాలకు సంబంధించి..గత సంవత్సరం 2022 అక్టోబర్ నుండి ప్రస్తుత సంవత్సరం అక్టోబర్ నెల ఇప్పటివరకు) తీసిన మూడు ఫోటోలు, షార్ట్ ఫిల్మ్ మాత్రమే పంపించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం 7702513469 నెంబర్ ద్వారా పీఆర్ వోను సంప్రదించాలని సూచించారు. అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నిర్వహిస్తున్న పోటీలకు విద్యార్థులతో పాటు ఔత్సాహికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్ని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ కోరారు.