• జేడీఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి

 

 

వేద న్యూస్ , హుజురాబాద్ టౌన్ : 

హుజురాబాద్ ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జిల్లాగా ప్రకటించాలని జనతాదళ్ ( సెక్యులర్ ) పార్టీ జేడీఎస్ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి అన్నారు.

 

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. పాత తాలూకాగా పేరుగాంచిన హుజురాబాద్ ను చుట్టుపక్క ప్రాంతాలను కలుపుకొని కొత్త మండలాలను ఏర్పాటు చేయాలని. గతంలో హుజురాబాద్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో జిల్లా సాధన కోసం ఎన్నో కార్యక్రమాలను నిర్వహించామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే హుజురాబాద్ ను జిల్లాగా ప్రకటించాలని ప్రాంత ప్రజల పక్షాన  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 

One thought on “హుజురాబాద్ ను జిల్లాగా ప్రకటించాలి”

Comments are closed.