వేద న్యూస్, వరంగల్ టౌన్:

ధనుర్మాసంలో శ్రీ వేణుగోపాల స్వామికి నిర్వహించే గరుడ వాహన సేవ నిర్వహించామని వేణుగోపాల స్వామి దేవాలయ బ్రహ్మోత్సవ కమిటీ అధ్యక్షులు ఇరుకుల్ల రమేష్ అన్నారు. వరంగల్ నగరంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో ధనుర్మాసం పురస్కరించుకొని ఏకాదశి సందర్భంగా వేణుగోపాల స్వామివారికి గరుడ వాహన సేవ నిర్వహించారు.

మహిళలు పెద్ద ఎత్తున మంగళ హారతి ఇస్తూ స్వామివారికి స్వాగతం పలికారు. వేణుగోపాల స్వామికి కార్తీకమాసం తో పాటు ధనుర్మాసంలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తామని, ప్రత్యేకంగా ఏకాదశి నాడు స్వామికి చిన్న జీయర్ స్వామి ఆశీస్సులతో విశేష సేవలు చేస్తామని బ్రహ్మోత్సవ కమిటీ అధ్యక్షులు ఇరుకుల్ల రమేష్ తెలిపారు.

భక్తుల దర్శనార్థం గరుడ వాహన సేవను పురవీధుల్లో ఊరేగించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందచేస్తామని స్వామి వారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరి అందరూ సుఖసంతోషాలతో ఉంటారని ఆలయ అర్చకులు రామా చార్యులు అన్నారు.

ఈ కార్యక్రమంలో కొత్త వెంకటకృష్ణ, తోట నవీన్కుమార్ , బెజుగం రజినీకాంత్, దివ్వెల శ్రీనివాస్, దివ్వెల నాగరాజు, పాలరాపు పనేష్, నీలా రాజన్న, ఆకుల సర్వేశ్వర్ రావు, గన్ను సతీష్, బోనగిరి రాజు, అయిత నరేష్,కృష్ణకాంత్ నగబోతు రమేష్, తదితరులు పాల్గొన్నారు.