వేద న్యూస్, జమ్మికుంట:
డా క్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆదివారం అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు కసుబోజుల వెంకన్న, సీనియర్ కాంగ్రెస్ నాయకులు యం.డి.సలీం, యెగ్గని శ్రీనివాస్, చిన్నింటి నాగేంద్ర పాల్గొన్నారు.