వేద న్యూస్, జమ్మికుంట:

జమ్మికుంట పట్టణానికి చెందిన గండ్ర సుహాసిని- తిరుపతిరావు దంపతులు తమ కుమారుడు క్రితిక్ రావు పుట్టినరోజు సందర్భంగా అన్నదానం చేశారు.

పట్టణంలోని బొమ్మల గుడి శివాలయంలో ఈ కార్యక్రమం చేపట్టారు. కాగా, అన్ని దానాల్లో కెల్లా అన్నదానం గొప్పదని, జన్మదినం సందర్భంగా అన్నదానం చేయడం మంచి కార్యక్రమం అని పలువురు కొనియాడారు. బొమ్మల గుడి ఆలయ కమిటీ సభ్యులు అన్నదాత గండ్ర సుహాసిని తిరుపతిరావును ఈ సందర్భంగా సత్కరించారు.