వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ వారి ఆధ్వర్యంలో వరంగల్ జిల్లాకు చెందిన వైద్య ఉద్యోగిని జూలూరి రమాదేవి, ఆమె కుమారుడు జూలూరి వంశీకృష్ణ సహకారంతో స్వయంకృషి మహిళా సొసైటీ వృద్ధాశ్రమం ములుగు రోడ్, హనుమకొండలో ఉన్న వృద్ధులకు 271వ రోజు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. గురువారం వారు అన్నదానం చేశారు.
కార్యక్రమంలో జూలూరి రమాదేవి, వంశీకృష్ణ, యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ అధ్యక్షులు కొత్తకొండ అరుణ్ కుమార్, వరంగల్ పోలీస్ కానిస్టేబుల్ కన్నె రాజు ( స్విమ్మర్ రాజు), కానిస్టేబుల్ బొట్టు కమలాకర్ , కోలా రాజేష్ , ప్రభుత్వ ఉపాధ్యాయుడు గజ్జెల సుమన్ , అలువల పృథ్వి , ఉప్పరపల్లి రాజ్ కుమార్, మునిగాల రాంప్రసాద్ , సృజన, జ్యోతి, భావన , బిటుకూరి యాకయ్య , పాలకుర్తి విష్ణు , ఎస్.కె ముస్తఫా, లీగల్ అడ్వైజర్ రాచకట్ల కృష్ణ ( హైకోర్ట్ అడ్వకేట్), ఊరటి రవికుమార్ , యాద రవి కుమార్, చెలిమల్ల అశోక్ కుమార్, తూనం రాము, సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ వైనాల రమేష్ , మోడెం రాజశేఖర్ గౌడ్, నాగవెళ్లి కార్తిక్ పాల్గొన్నారు.