వేద న్యూస్, వరంగల్ క్రైమ్:
వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడంతో చాలా మంది రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారని, హెల్మెట్ ధరించి వాహనాలు నడపటం వలన ఒక రక్షణ కవచంలా ఉపయోగపడుతుందని వరంగల్ ట్రాఫిక్ సీఐ పి. వెంకన్న అన్నారు.
వరంగల్ నగరంలోని పోచమ్మ మైదాన్ సెంటర్ వద్ద గురువారం ఆయన వాహనదారులకు హెల్మెట్ వాడకం వలన కలిగే ప్రయోజనాలను వాహనదారులకు వివరించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి తమ విలువైన ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఎస్సైలు, కానిస్టేబుల్ పాల్గొన్నారు.