• మిల్స్ కాలనీ సీఐగా రమేష్ బాధ్యతలు స్వీకరణ 
  •  గత చరిత్రను పక్కనబెట్టి నూతన అధ్యాయం లిఖించాలని పలువురి ఆకాంక్ష

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: 

వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలోని ఏ.జే మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ నూతన ఇన్ స్పెక్టర్ గా శనివారం బొల్లం రమేష్ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఇన్ స్పెక్టర్ గా విధులు నిర్వహించిన వెంకటరత్నం సస్పెండ్ కావడంతో వరంగల్ పోలీస్ కమిషనర్ బొల్లం రమేష్ కు బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయన బాధ్యతలను స్వీకరించారు.

 ప్రత్యేక శ్రద్ధ వహిస్తే.. చక్కటి పేరు

గత కొన్ని ఏండ్లుగా మిల్స్ కాలనీ ఇన్ స్పెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన వారిలో మెజారిటీ అధికారులు ఏ ఆరోపణ లేకుండా ట్రాన్స్‌ఫర్ కాలేదని చెప్పొచ్చు. సాధారణ బదిలీలో భాగంగా ఈ పీఎస్ నుంచి వెళ్లిన వారు అరుదుగా ఉండటం గమనార్హం. ఈ పీఎస్ ఎస్‌హెచ్‌వోలుగా పని చేసిన ఆఫీసర్లలో ఎక్కువ మంది ఏదో ఒక ఆరోపణ మోస్తూ.. సస్పెండయి వెళ్లిన వారే తప్ప.. నిజాయితీగా పని చేసి బదిలీ‌పై వెళ్లినవారు అరుదు అని చెప్పకతప్పదు..

కాగా నూతనంగా ఇన్‌స్పెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన బొల్లం రమేష్.. గత చరిత్రను పక్కనబెట్టి ప్రజల ఆదరాభిమానాలు చూరగొనాలని, ప్రజల అధికారిగా పని చేయాలని జనం ఆకాంక్షిస్తున్నారు.

పీఎస్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ విషయమై ప్రత్యేక శ్రద్ధ వహించి.. జనం మనసులో స్థానం పొందేలా పని చేస్తే.. ఈ పీఎస్‌కు చక్కటి పేరు వస్తుందని, నూతన చరిత్ర లిఖితమవుతుందని పలువురు పేర్కొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *