వేద న్యూస్, జమ్మికుంట:

జమ్మికుంట పట్టణంలోని వీణవంక రోడ్లో గల రాయల్ బేక్స్ లో తిను బండారాల పై ఎలాంటి తయారీ, ఎక్స్పైర్ తేదీలు లేని తినుబండారలను విక్రయిస్తున్న బేకరీ పై చర్యలు తీసుకోవాలనీ తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చెల్పూరి రాము కోరారు.

  సోమవారం ఆయన మాట్లాడుతూ.. జమ్మికుంట పట్టణానికి రోజు వేలాదిమంది విద్యార్థులు, వివిధ రకాల ప్రజలు పనుల నిమిత్తం వస్తూ ఉంటారనీ పేర్కొన్నారు. స్నాక్స్ రూపకంగా ఆకలి తీర్చుకునేందుకు బేకరీ కి వెళ్తే తినుబండారాలపై.. ఎలాంటి తయారు చేసిన తేదీ ఎక్స్పైర్ అయ్యే తేదీలు లేకుండా అమ్ముతున్నారని వెల్లడించారు.

ఇలాంటి అమ్మకాల వల్ల పేద ప్రజలు,విద్యార్థుల ఆరోగ్యాలు, రోగల బారినపడుతున్నరనీ,  ఆసుపత్రిలో పాలవుతారని అన్నారు. వెంటనే మున్సిపల్ కమిషనర్ స్థానిక ఎమ్మార్వో , ఫుడ్ ఇన్ స్పెక్టర్ స్పందించి, తనిఖీలు నిర్వహించి.. నాణ్యతలేని తినుబండారా లు అమ్మే, బేకరీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.