వేద న్యూస్, హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని తీగలగుంటపల్లి గ్రామంలో చలివేంద్రాన్ని ఎన్ఎస్యూఐ హుస్నాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు సనత్ రెడ్డి గురువారం ప్రారంభించారు.
ఎండ అధికంగా ఉండటంతో గ్రామ ప్రజలకు అలాగే రోడ్డుపై ప్రయాణించే వారికి దాహం తీర్చడానికి చలివేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎన్ఎస్యూఐ కోహెడ మండల అధ్యక్షుడు రంజిత్ రెడ్డి, సభ్యులు కార్తీక్, ఆదిత్య, ప్రశాంత్, వివేక్, అంజి, కిషోర్, వినయ్ పాల్గొన్నారు.