వేద న్యూస్, డెస్క్:
కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు ప్రెస్ క్లబ్ ఆడిటోరియంలో శుక్రవారం ఛత్రపతి శివాజీ మహరాజ్ పుస్తకాన్ని ప్రముఖులు ఆవిష్కరించారు. దత్తాజి లక్ష్మణ్ నలవాడే, మావలా జవాన్ సంస్థ టీమ్ వారి ఆహ్వానం మేరకు విశిష్ఠ అతిథిగా ఛత్రపతి శివాజీ మహారాజ్ 351 వ పట్టాభిషేక మహోత్సవం, ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్రను దత్తాజి లక్ష్మణ్ నలవాడే మరాఠీలో రచించిగా, ఆ పుస్తకం కన్నడ భాషలోకి తీసుకొచ్చారు.
‘విశ్వ మహానాయకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్’ అనే పేరుతో పుస్తక ఆవిష్కరణ సభ జరిగింది. ఈ ప్రోగ్రామ్కు ముఖ్య అతిథులుగా సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్దన్న సత్యనారాయణ రావు గైక్వాడ్ , విజయనగర సామ్రాజ్య శ్రీ కృష్ణదేవరాయలు వారసులు రాజా కృష్ణదేవరాయ, కర్ణాటక మాజీ హోం శాఖ మంత్రి పి. జె.ఆర్ సింధియా, శివగర్జన సంస్థ అధ్యక్షుడు ప్రవీణ్ మానే తదితరులు హాజరయ్యారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ తన రాజ్యంలో ప్రజలను కుటుంబ సభ్యులుగా చూసుకున్నారని, రైతులతో పాటు అన్నివర్గాల ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న ఆదర్శనేత శివాజీ అని కొనియాడారు.