- ప్రపంచానికి మానవాళికి అభివృద్ధి ఆదర్శం సమానత్వం కావాలంటే కమ్యూనిస్టులతోనే సాధ్యం
- సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నాగయ్య
వేద న్యూస్, మరిపెడ:
మహబూబాబాద్ పట్టణంలో సిపిఎం రాజకీయ శిక్షణ తరగతుల కార్యక్రమన్ని సిపిఎం పట్టణ కార్యదర్శి బానోత్ సీతారాం నాయక్ అధ్యక్షతన నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పార్టీ నాయకులు నాగయ్య , సాదుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. దేశంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ మతోన్మాద రాజకీయలపై, సైద్ధాంతికంగా పోరాటం చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జీ.నాగయ్య పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ప్రపంచంలో లో ఉన్న పెట్టుబడిదారు దేశాలు ఆర్ధిక వ్యవస్థ రోజు రోజుకు కుప్పకూలీ పోతుందని అన్నారు .ఈ ఆర్ధిక మాన్యం నుండి బైటపడాలంటే కమ్యూనిజము సోషలిజమే మార్గమని చెప్పారు.
ప్రపంచంలో చైనా, రష్యా, కుబా, వియత్నం ఆర్ధికంగా విద్య వైద్యం ఉపాధి కుల మతలు లేకుండా రాజకీయాల సమానత్వం టెక్నాలజీ పరంగా అగ్ర రాజ్యాంగ దుసుకోపోతున్నాయని అన్నారు.
భారత దేశంలో 28,రాష్టాలలో సిపిఎం పార్టీ పరిపాలిస్తున్న కేరళ రాష్టం విద్య వైద్యం ఉపాధి సమానత్వం పేదలు లేని రాష్టం గా దేశానికే ఆదర్శనంగా మెడల్ గా సిపిఎం పార్టీ ముఖ్య మంత్రి పినరాయి విజయన్ ఆధ్వర్యంలో అన్ని రంగాల్లో దూసుకోపోతున్నాదని పేర్కొన్నారు.
ప్రపంచం లో ఉన్న పెట్టుబడిదేశాలు సోషలిజం కామ్యూనిజం వైపే చూస్తున్నాయని అన్నారు…
పార్టీ స్వతంత్ర బలాన్ని పెంచుకోవడంతో పాటు రాజకీయంగా, సైద్ధాంతికంగా బలోపేతం కావాలని అన్నారు. రాజకీయ శిక్షణ తరగతులను క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. పార్టీ సభ్యత్వం, నిర్మాణం బలోపేతం కావాలని చెప్పారు.
మోడీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ బూటకపు ఎన్కౌంటర్లు చేస్తూ కేంద్ర హోం శాఖ మంత్రి బహిరంగంగా నిర్దిష్ట తేదీలతో మావోయిస్టులను నక్సలిస్టులను లేకుండా చంపుతామని బహిరంగంగా చెప్పడం ప్రభుత్వ అహంకార ధోరణి అని విమర్శించారు.
ఆపరేషన్ కగార్ పేరుతో అడవిని నమ్ముకొని బ్రతుకుతున్న ఆదివాసుల ప్రాణాలను పొట్టను పెట్టుకుంటున్నారని అన్నారు. మరో కేంద్రమంత్రి ప్రశ్నించే గొంతుకలను అర్బన్ నక్సలైట్లు అనే వ్యాఖ్యానించడం రాజ్యాంగ విరుద్దామని అన్నారు
బీహార్ ఎన్నికలలో భారీ ఎత్తున ఓటు చోరీ జరిగిందని ప్రజలందరూ రోడ్డెక్కినప్పటికీ ఎన్నికల కమిషన్ కి నిమ్మకు నీరెత్తినట్టు కూడా లేదని అన్నారు. లౌకిక, ప్రతిపక్ష పార్టీలన్నీ ఎన్నికల ముందు ఆధారాలతో నిరసనలు తెలిపినప్పటికీ బీహార్లో దొంగ ఓట్ల లెక్కలు మరిన్ని పెరిగాయని అన్నారు .
బతికున్న ప్రజల ఓట్లను ఈసీ తొలగించిందని విమర్శించారు. అక్కఆర్ఎస్ఎస్, బీజేపీ హిందూత్వ ఎజెండాను అమలు చేస్తున్నాయని విమర్శించారు. మైనార్టీలపై దాడులు చేస్తున్నాయని చెప్పారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మైనార్టీలే లక్ష్యంగా పాలన సాగుతున్నదని అన్నారు. బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
రాబోయే రోజులన్నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వల ప్రజా వ్యతిరేకత పాలనపై ప్రజలకుచ్చిన హామీలను అమలు చేయుటకువిద్య వైద్యం ఉపాధి ఇంటిస్థలాలు పట్టాలు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలని ప్రతి కమ్యూనిస్ట్ కార్యకర్త సైనికుడిగా పోరాటాలకు సిద్ధం కావాలని అన్నారు..
సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలకు సిద్ధాంత, రాజకీయ అవగాహనను పెంచడం కోసమే ఈ శిక్షణ తరగతులను నిర్వహించామని రాబోయే కాలంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకంగా జరిగే పోరాటాలకు తమ పార్టీ శ్రేణులను సంసిద్ధం చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమం లో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సూర్నపు సోమయ్య ,జిల్లా కమిటీ సభ్యులు సమ్మెట రాజమౌళి, ఒన్ టౌన్ ఏరియా కార్యదర్శి రావుల రాజు ,పట్టణ కమిటీ సభ్యులు కుమ్మరి కుంట్ల నాగన్న ,బానోత్ వెంకన్న ,శాఖ కార్యదర్శి లు పార్టీ సభ్యులు పాల్గొన్నారు.