వేద న్యూస్, జమ్మికుంట:

ప్రముఖ ఆస్పత్రుల నిర్వహణ సంస్థ ఏఐజీ హాస్పిటల్స్ ‘ఫెలోషిప్ ప్రోగ్రామ్ 2.0’ ఇన్ అడ్వాన్స్ డిసీజ్ మేనేజ్‌మెంట్‌కు జమ్మికుంట ‘సంజీవని’ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యుడు, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ఊడుగుల సురేశ్ హాజరయ్యారు. ఈ నెల(జూన్) 6, 7 తేదీల్లో రెండు రోజుల పాటు ఫిజీషియన్స్ కోసం నిర్వహిస్తున్న హైదరాబాద్  ఏఐజీ హాస్పిటల్స్‌లో చేపడుతున్న ఈ కార్యక్రమానికి వైద్యుడు సురేశ్ అటెండయ్యారు. ఏఐజీ హాస్పిటల్స్ ఈ ప్రోగ్రామ్‌ను SOLARES భాగస్వామ్యంతో నిర్వహిస్తోంది.   

‘గట్ హెల్త్- వెల్‌నెస్ అన్‌లాక్‌డ్’ అనే అంశంపై ప్రముఖ హాస్పిటల్ ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్యుడు డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి ప్రసంగించారు.

ఈ ఫెలోషిప్ ప్రోగ్రామ్‌లో  వివిధ అంశాలపై వైద్య నిపుణులు మాట్లాడనున్నారు. న్యూరాలజీ, ఆంకాలజీ, పల్మనాలజీ, ఎండోక్రినోలజి, గ్యాస్ట్రో ఎంటరాలజీ, కార్డియాలజీ, నెఫ్రోలజీ, రుమటాలజీ, ఈ‌ఎన్‌టీ విభాగాలపై నిపుణులు వివరించనున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *