- చేరికలతో బీఆర్ఎస్ పార్టీలో జోష్
వేద న్యూస్, ఎలిగేడు:
పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలో గులాబీ పార్టీకి తిరుగు లేదని, పార్టీ క్షేత్రస్థాయిలో బలంగా ఉందని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రోజురోజుకూ తమ పార్టీ బలం పెరుగుతోందని పేర్కొంటున్నారు. మండల పరిధిలోని దూళికట్ట గ్రామంలో బుధవారం యాదవ, ముదిరాజ్, గౌడ, ఆటో యూనియన్కు సంబంధించిన 300 మంది యువకులు, డ్రైవర్లు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తనయుడు దాసరి ప్రశాంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.
ప్రశాంత్ రెడ్డి వారందరికీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన యువకులు మాట్లాడుతూ కేసీఆర్ సంక్షేమ పథకాలకు, పెద్దపల్లి లో దాసరి మనోహర్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులమై గులాబీ పార్టీలో చేరినట్లు తెలిపారు. ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ పెద్దపల్లీ లో మళ్లీ గెలిచేది బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి అని ధీమా వ్యక్తం చేశారు.
మనోహర్ రెడ్డి అత్యంత భారీ మెజార్టీతో గెలిచి..పెద్దపల్లిని రాష్ట్రంలోనే అగ్రగామి నియోజకవర్గంగా..అన్ని విధాల అభివృద్ధి చేస్తారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎలిగేడు ఎంపీపీ తానిపర్తి స్రవంతి మోహన్ రావు, ఎలిగేడు మండల బీఆర్ఎస్ అధ్యక్షులు బైరెడ్డి రామిరెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సుధాకర్ రావు, కోఆప్షన్ సభ్యులు ఎండి ఖలీల్, దూళికట్ట గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షులు మారం కొమురయ్య యాదవ్, సీనియర్ నాయకులు భూసార రమేష్ గౌడ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.