వేద న్యూస్, వరంగల్/నెక్కొండ:
కోట్లాదిమంది ప్రజలు కుల, మతాలకు అతీతంగా పూజించే వ్యక్తి గాంధీ అని జనసేన నర్సంపేట నియోజకవర్గ ఇన్‌చార్జి మెరుగు శివకోటి యాదవ్ అన్నారు.

సోమవారం నర్సంపేట పట్టణంలోని ఆ పార్టీ కార్యాలయంలో భారత జాతిపిత మహాత్మా గాంధీ 154వ జయంతి వేడుకలను శివ కోటి యాదవ్ ఆధ్వర్యంలో జనసేన కార్యవర్గ సభ్యుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకులు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం శివకోటి యాదవ్ మాట్లాడుతూ అహింసా మార్గంలో స్వతంత్ర సంగ్రామాన్ని నడిపించిన యోధుడు మహాత్మా గాంధీ అని చెప్పారు.

బాపూజీ అనుసరించిన మార్గం అన్ని తరాలకు ఆదర్శప్రాయం అని పేర్కొన్నారు. కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు వంగ మధు, షేక్ హుస్సేన్, ఉడుగుల క్రాంతి, గంగుల రంజిత్, ప్రధాన కార్యదర్శులు ఓర్సు రాజేందర్,గాండ్ల అరుణ్, కార్యవర్గ సభ్యులు బొబ్బ పృథ్వీరాజ్,రొడ్డ శ్రీకాంత్,కొమ్ము రంజిత్,రాపోలు సురేష్,గద్దల కిరణ్,మిలాన్,లహరి, రణదీప్,సూర్య,రవి, భార్గవ్,నితిన్,అశోక్ తదితరులు పాల్గొన్నారు.