వేద న్యూస్, వరంగల్ టౌన్:

అయోధ్యలో బాల రాముని ప్రతిష్ట జరుగుతున్న సమయంలో వరంగల్ నగరంలోని భక్తులందరూ శోభయాత్రలు నిర్వహించి మహా అన్నదానాలు నిర్వహించారు. వరంగల్ నగరం రామనామ స్మరణతో మార్మోగింది.

 

వరంగల్  తూర్పు నియోజకవర్గం లోని అండర్ బ్రిడ్జి ప్రాంతంలో నమో నమః సేవాసమితి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ అన్నదాన కార్యక్రమానికి వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భక్తులు రామనామ స్మరణతో శ్రీరాముని స్మరిస్తూ మహా అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.