వేద న్యూస్, హుస్నాబాద్:
హుస్నాబాద్ మున్సిపాలిటీ స్వచ్ఛ సర్వేక్షన్ -2023 లో భాగంగా భారతదేశంలోని అన్ని పట్టణాలతో పోటీ పడగా దక్షిణ భారతదేశంలోని 15000 – 25000 లోపు జనాభా గల పట్టణాల్లో హుస్నాబాద్ మున్సిపాలిటీ “క్లీనెస్ట్ సిటీ” 3 వ స్థానం ఎంపికైంది. ఈ సందర్భంగా రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం హర్షం వ్యక్తం చేశారు. హుస్నాబాద్ మున్సిపాలిటీ స్వచ్ఛ సర్వేక్షన్ లో ఎంపిక కావడం ఇది మూడోసారి.

స్వచ్ఛ సర్వేక్షన్ లో క్లీనెస్ట్ సిటీ గా ఎంపిక కావడంలో భాగస్వామ్యమైన గౌరవ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు ,కో అప్షన్ సభ్యులు ,అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ అభినదించారు. భవిష్యత్ లో హుస్నాబాద్ మున్సిపాలిటీ మరెన్నో అవార్డులు సాధించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు.