వేద న్యూస్, వరంగల్ టౌన్:

అయోధ్య రామాలయంలో ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారతీయులు సంబరాలు నిర్వహిస్తున్నారు. కాగా వరంగల్ నగరంలోని తూర్పు నియోజకవర్గం కరీమాబాద్ ప్రాంతనికి చెందిన నవయువ చైతన్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భక్తులు హనుమంతుని భారీ విగ్రహంతో ర్యాలీ నిర్వహించారు.

యువకులందరూ కలిసి నిర్వహించిన ఈ ర్యాలీ అందర్నీ ఆకట్టుకుంది.కాగా పలువురు యువతీ,యువకులు రామనామం జపించారు. దీంతో కరీమాబాద్ ప్రాంతం జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగింది.