వేదన్యూస్ -వాంఖేడ్ స్టేడియం
ముంబై ఇండియన్స్ జట్టుతో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో రాయల్స్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు సీనియర్ ఆటగాడు.. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోరికార్డును సృష్టించాడు.
ముంబై ఇండియన్స్ బౌలర్ బౌల్ట్ బౌలింగ్ లో వరుసగా ఫోర్లను సాధించడంతో టీ20ల్లో13,000పరుగులు చేసిన టీమిండియా ఆటగాడిగా చరిత్రకెక్కాడు.ఈ మ్యాచ్ లో కోహ్లీ 67(42బంతులు) చేసి ఔటయ్యాడు.
మరోవైపు కిరన్ ఫోలార్డ్ (13,537),శోయబ్ మాలిక్ (13,557), హేల్స్ (13,610) పరుగులతో టాప్ లో ఉన్నారు.తొలి స్థానంలో సిక్సర్ల వీరుడు.. విండీస్ మాజీ ఆటగాడు క్రిస్ గేల్ (381 ఇన్నింగ్స్ లో 14,562 పరుగులు) ఉన్నాడు.