•  తహశీల్దార్ కు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వడ్లూరి కిషోర్ వినతి

వేద న్యూస్, జమ్మికుంట:

జమ్మికుంట మండలంలోని అంకుషాపూర్ గ్రామంలో గల సర్వేనెంబర్ 570లో ప్రభుత్వ భూములను కాపాడాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు వరులూరి కిషోర్ కోరారు. జమ్మికుంట తహసిల్దార్ వెంకట్ రెడ్డికి ప్రభుత్వ భూమిని కాపాడాలని వినతి పత్రం ఇచ్చారు. 

ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టిడిపి ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం నిరుపేద కుటుంబానికి చెందిన అందరికీ 180 గజాల చొప్పున ఇచ్చిందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత గత బిఆర్ఎస్ ప్రభుత్వం అండదండలతో కొంతమంది వ్యక్తులు నాయకులు ఒక మూటగా ఏర్పడి ప్రభుత్వ భూములను కబ్జా చేయాలని చూస్తున్నారని .అదేవిధంగా కొన్ని గుంటలలో అక్రమ కట్టడాలు కడుతున్నారని పేర్కొన్నారు. 

కావున జిల్లా కలెక్టర్ ప్రభుత్వ అధికారులు స్పందించి సమగ్ర విచారణ చేసి ప్రభుత్వవో ని కాపాడాలని కోరారు. లేనియెడల కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *