వేద న్యూస్, డెస్క్ :
మేడారం సమ్మక్క – సారలమ్మ జాతర ప్రారంభోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గిరిజనుల అతి పెద్ద పండుగల్లో సమ్మక్క – సారలమ్మ జాతర ఒకటి అంటూ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
మేడారం జాతర భక్తి, సంప్రదాయం, సమాజ స్ఫూర్తిల గొప్ప కలయిక అంటూ హర్షం వ్యక్తం చేశారు. మనమంతా ఆ వన దేవతలకు ప్రణమిల్లాలని సూచించారు. వారు అభివ్యక్తీకరించిన ఐక్యతా స్ఫూర్తిని, పరాక్రమాన్ని గుర్తు చేసుకుందామని ఎక్స్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.