• సిఐఎస్ఎఫ్ బలగాలతో ఫ్లాగ్ మార్చ్
  •  ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలి
  •  హుజురాబాద్ ఏసీపీ సిహెచ్ శ్రీనివాస్ జి

వేద న్యూస్, జమ్మికుంట:
రానున్న పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా కరీంనగర్ కు విచ్చేసిన సీఐఎస్ఎఫ్ బలగాలతో గురువారం జమ్మికుంట టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విలాసాగర్, కోరపల్లి గ్రామాలలో హుజరాబాద్ ఏసిపి సిహెచ్ శ్రీనివాస్, జమ్మికుంట పట్టణ సిఐ వి రవికుమార్ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.

ఈ ఫ్లాగ్ మార్చిలో సీ.ఐ.ఎస్.ఎఫ్ బలగాలతో పాటు స్థానిక పోలీసులు స్పెషల్ యాక్షన్ టీం పోలీసులు పాల్గొన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సీ.ఐ.ఎస్.ఎఫ్ సేవలు వినియోగించనున్నామని కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి తెలిపారు.

కార్యక్రమంలో హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్, కంపెనీ కమాండెంట్ విక్రాంత్, అసిస్టెంట్ కమాండంట్ విజేందర్, జమ్మికుంట ఇన్ స్పెక్టర్ రవికుమార్, సురేష్ ( ఆర్.ఐ. అడ్మిన్) ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు