వేద న్యూస్,డెస్క్ :

భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన ముగించుకొని ఢిల్లీ బయలుదేరిన సమయంలో జరిగిన సంఘటన ఆసక్తికరంగా మారింది. ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య సరదా సన్నివేశం చోటు చేసుకుంది. ఆ సమయంలో తీసిన చిత్రాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారాయి.

ప్రధానిని హస్తినకు సాగనంపే క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, బీజేపీ నేత రాములు విమానం వద్ద ప్రధాని గురించి వేచి ఉన్నారు. అప్పుడే విమానం ఎక్కడానికి వస్తున్న ప్రధాని మోడీకి వీడ్కోలు చెప్పడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూలగుచ్ఛం అందించారు.

పుష్పగుచ్చం అందుకున్న ప్రధానికీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య ఏదో సరదా సంభాషణ జరిగింది. ఈ మాటలతో మోడీతో పాటు అక్కడే ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్, బీజేపీ నేత రాములు గట్టిగా నవ్వుకున్నారు. ఈ ఫొటో కాస్త  సోషల్ మీడియాలో వైరల్ మారింది. అక్కడ ఏం జరిగి ఉంటుందనే విషయంపై నెటిజన్లు రకరకాలుగా తమ ఊహాగానాలను కామెంట్ల రూపంలో తెలుపుతున్నారు.