వేద న్యూస్, వరంగల్ టౌన్:
భారత జాగృతి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిరుపేద చిన్నారులకు సహస్ర ఫౌండేషన్ సంస్థ వారి సౌజన్యంతో గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా నిరుపేద పిల్లలకు భారత జాగృతి ఉమ్మడి వరంగల్ జిల్లా అధికార ప్రతినిధి మడిపల్లి సుశీల్ గౌడ్ ఆధ్వర్యంలో ఆహారపు ప్యాకెట్లను అందజేశారు. అనంతరం సుశీల్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకోసం ప్రాణాలను సైతం లెక్కచేయని వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు.