- కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే దాసరి
- మనోహర్ రెడ్డి గెలుపే లక్ష్యం: విజ్జగిరి
వేద న్యూస్, ఎలిగేడు/సుల్తానాబాద్:
సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డుకు చెందిన విజ్జగిరి సంజీవ్ ఆదివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి, మాజీ సర్పంచ్ డాక్టర్ ఐల రమేష్ ఆధ్వర్యంలో విజ్జగిరి సంజీవ్తో పాటు హనుమాన్ నగర్ యూత్ సభ్యులు తొర్రికొండ రాజు, కోయల్ కార్ నాగరాజు, తొర్రికొండ రాకేష్ పలువురు పార్టీ నాయకులు గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా నాయకులందరికీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతీ కుటుంబానికి ఏదో ఒక పథకం లబ్ధి చేకూరేలా చేసిందని చెప్పారు. అనంతరం ఐల రమేష్ మాట్లాడుతూ బీఆర్ఎస్ లో చేరిన వారికి తప్పకుండా సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు.
ఎమ్మెల్యేగా దాసరిని గెలిపించడమే లక్ష్యం
విజ్జగిరి సంజీవ్ మాట్లాడుతూ పెద్దపెల్లి ఎమ్మెల్యేగా దాసరి మనోహర్ రెడ్డిని గెలిపించడానికే బీఆర్ఎస్లో చేరానని పేర్కొన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రంలో సుపరిపాలన ఉంటుందని స్పష్టం చేశారు. కుల, మత బేధాలు లేకుండా అన్ని వర్గాలను ఆదుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని నొక్కి చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చూపించింది ముఖ్యమంత్రి కేసీఆర్ అని వివరించారు. కార్యక్రమంలో లాలపల్లికి చెందిన బీఆర్ఎస్ లీడర్ గుర్రం మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.