వేద న్యూస్, హైదరాబాద్/వరంగల్:
తెలంగాణ స్టేట్ ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌గా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య నియామకమయ్యారు. చైర్మన్‌తో పాటు సభ్యులుగా ఎం రమేశ్‌, సంకేపల్లి సుదీర్‌రెడ్డి, నెహ్రూనాయక్‌ మాలోత్‌ను నియమిస్తూ గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

కమిషన్‌ చైర్మన్‌తో పాటు సభ్యులు రెండేండ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. శుక్రవారం ఈ కమిషన్ చైర్మన్ తో పాటు సభ్యుల నియామకం జరిగింది. సిరిసిల్ల రాజయ్య గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్ సభ సభ్యుడిగా ప్రాతినిథ్యం వహించారు. 15వ లోక్‌సభకు కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు.