వేద న్యూస్, జమ్మికుంట:
ప్రపంచవ్యాప్తంగా జెర్డ్(జీఈఆర్డీ GERD-గ్యాస్ట్రో ఎసోఫాగియల్ రిఫ్లక్స్ ) వ్యాధితో 1.03 బిలియన్ మంది బాధపడుతున్నారు. మన దేశంలో(భారత్) ప్రతి 100 మందిలో 16 మందికి జెర్డ్ వ్యాధి ఉన్నదని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. భారతీయులకు 7.6 %గణనీయమైన (జీఈఆర్డీ GERD) లక్షణాలు ఉండటం గమనార్హం. ఈ వ్యాధి ప్రతి వయసులో సంభవిస్తుంది. కాగా, ఈ డిసీజ్పై ప్రజలకు అవగాహన కల్పించే నిమిత్తం భారత మల్టీ నేషనల్ ఫార్మా కంపెనీ(మ్యాన్ కైండ్, neo Mankind) ముందుకు రాగా, సంజీవని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ ఊడుగుల సురేశ్ (ఎంబీఎస్ ఎండీ-జనరల్ మెడిసిన్) డిసీజ్ గురించి వివరించారు.
డిసీజ్కు సంబంధించిన అంశాలన్నీ బుక్లో సవివరంగా పొందుపరిచారు. ఈ బుక్ ను (THE GERD GUIDE..) సంజీవని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో తాజాగా డాక్టర్ సురేశ్ ఆస్పత్రి వైద్యులు సిబ్బందితో కలిసి ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో జీర్ణ వ్యవస్థ, ఉదర ఆమ్లం పాత్ర, ఆమ్ల ప్రతిచర్య, కీలక వ్యత్యాసాలు, జెర్డ్ లక్షణాలు, కారకాలు, జెర్డ్ నిర్ధారణ, చికిత్స వంటి విషయాలంపై కూలంకషంగా వివరించారు.
డయాగ్రామ్స్(చిత్రాలు)తో పాటు అర్థమయ్యే విధంగా చక్కటి వివరణను బుక్లో ప్రజెంట్ చేశారు. (జీఈఆర్డీ- GERD ) లక్షణాలలో కీలకమైన వాటిని చక్కగా పట్టిక రూపంలో వెల్లడించారు. దాంతో పాటు అపోహలు , వాస్తవాలు కూడా చక్కగా చెప్పారు. గ్యాస్ట్రో ఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధికి సంబంధించి నిర్ధారణకు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలనే సూచనతో పాటు తిన్న వెంటనే పడకోకూడదని పుస్తకంలో ప్రధానంగా స్పష్టం చేశారు.
అయితే, ఈ పుస్తకం కేవలం ప్రజలకు అవగాహన కల్పించేందుకు తీసుకొచ్చింది. పాఠకులు తమకు ఈ గ్యాస్ట్రో ఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి-జీఈఆర్డీ కి సంబంధించి ఎలాంటి లక్షణాలు ఉన్నా తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి. ప్రజలకు అవగాహన నిమిత్తం డాక్టర్ ఊడుగుల సురేశ్ చేసిన ఈ ప్రయత్నాన్ని పలువురు అభినందిస్తున్నారు. భవిష్యత్తులో ఆయన వివిధ అంశాలపై మరింత అవగాహన కల్పించాలని కోరుతున్నారు.