వేద న్యూస్, ఎల్కతుర్తి:
ఎల్కతుర్తి మండల పరిధిలోని చింతలపల్లి గ్రామ ప్రజలు తమ సహృదయతను చాటుకున్నారు. వివరాల్లోకెళితే.. గ్రామానికి చెందిన వృద్ధురాలు కందుకూరి తిరుపతమ్మ అనారోగ్యంతో శనివారం మృతి చెందారు. కందుకూరి తిరుపతమ్మ కొడుకు వీరభద్రయ్య కుటుంబం కూలినాలి చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఆర్థికంగా వెనుకబడిన వీరభద్రయ్య ఫ్యామిలీకి చింతలపల్లి గ్రామ ప్రజలు అండగా నిలిచారు.

తమ వంతుగా తలా కొంత డబ్బులు పోగు చేసుకుని తిరుపతమ్మ అంత్యక్రియల నిర్వహణ నిమిత్తం రూ.10,500 కలెక్ట్ చేశారు. ఆ డబ్బులను దహన సంస్కారాల కోసం అందజేశారు. తోటి ఊరి ప్రజలు తమకు అండగా నిలిచి.. ఐక్యతను చాటడం మంచి విషయమని పలువురు అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *