– ఓట్ల కోసం అలవి కానీ హామీలు

– నోటికి అడ్డుఅదుపులేకుండా వాగ్ధానాలు

– అధికారంకోసం మొక్కని దేవుడు. ఎక్కని మెట్లు లేవు

– అధికారంలోకి వచ్చాక హామీలకు తూట్లు

– ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

వేద న్యూస్, పొలిటికల్ బ్యూరో : 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా నిప్పులు చెరిగారు. నాడు ఎన్నికల ప్రచారంలో ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు.. రాష్ట్రంలో నలబై రెండు లక్షల మంది రైతులకు ముప్పై వేల కోట్ల రూపాయలు అవసరం అని చెప్పారు.. తీరా అధికారంలోకి వచ్చాక అరకొర రుణమాఫీ చేసి అందరికి రుణమాఫీ చేశాము.. ఇక ఎవరికి చేయమంటూ సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడ్తారని దుయ్యబట్టారు..

ఆయన ట్విట్టర్ లో నాడు అధికారంకోసం.. ఓట్ల కోసం రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు ‘‘ఎక్కని గుడి లేదు- మొక్కని దేవుడు లేడు.. చేయని శపథం లేదు-ఆడని అబద్దం లేదు.. ఒకటా రెండా.. అక్షరాల 420 అబద్దపు హామీలు… నిండు శాసన సభ సాక్షిగా తెలంగాణ రైతన్న గుండెలపై గునపం దింపిన ఇందిరమ్మ రాజ్యం చట్టసభల సాక్షిగా వరంగల్ డిక్లరేషన్‌కు తూట్లు పొడిచిన కపట కాంగ్రెస్.. అధికారం కోసం అందరికి రుణమాఫీ- అధికారం దక్కాక కొందరికే రుణమాఫీ.. నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టు వ్యవహారిస్తుంది …

పెట్టెలో ఓట్లు పడ్డాయ్- జేబులో నోట్లు పడ్డాయ్- 

ఢిల్లీకి మూటలు ముట్టాయ్ ఇక ఇచ్చిన వాగ్దానాలు ఉంటే ఎంత గంగలో కలిస్తే ఎంత అన్నట్లుంది కాంగ్రెస్ యవ్వారం.. రూ.2 లక్షల వరకు కుటుంబంతో సంబంధం లేకుండా రుణమాఫీ అని ప్రకటించారు.. ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక్కరికే రుణమాఫీ అని చెబుతున్నారు… నాడు రూ. 2 లక్షలు దాటినా రుణమాఫీ అన్నారు.. ఇప్పుడేమో రూ. 2 లక్షల పైబడితే మాఫీ లేదంటున్నారు.. నాడు ఓట్ల కోసం హామీలు .. నేడు ఎగవేత కోసం కొర్రీలు..’’అంటూ మాజీ మంత్రి కేటీఆర్ తన ఎక్స్ లో పేర్కొన్నారు.