వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
అన్నదానం మహాదానం అని పలువురు అభిప్రాయపడ్డారు. యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ వారి ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లాకు చెందిన ఆలేటి శమంతకమణి – శంకర్ దంపతుల కుమారుడు ఆలేటి పృథ్వి చంద్ర పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు ఆలేటి శమంతకమణి-శంకర్, పృథ్విచంద్ర భార్య ఆలేటి సాధన సహకారంతో అన్నదానం గురువారం చేపట్టారు.
ములుగు రోడ్డు హన్మకొండలోని స్వయంకృషి మహిళా సొసైటీ వృద్ధాశ్రమం ఉన్న వృద్ధులకు 274వ రోజు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలేటి శమంతకమణి – శంకర్, ఆలేటి పృథ్వి చంద్ర – సాధన , దివిజ – మాధవ్, యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ అధ్యక్షులు కొత్తకొండ అరుణ్ కుమార్, వరంగల్ పోలీస్ కానిస్టేబుల్ కన్నె రాజు (స్విమ్మర్ రాజు) , కానిస్టేబుల్ బొట్టు కమలాకర్, కోలా రాజేష్ , ప్రభుత్వ ఉపాధ్యాయుడు గజ్జెల సుమన్ , అలువల పృథ్వి , ఉప్పరపల్లి రాజ్ కుమార్ , మునిగాల రాంప్రసాద్ , సృజన , జ్యోతి , భావన , బిటుకూరి యాకయ్య , పాలకుర్తి విష్ణు , ఎస్.కె ముస్తఫా , లీగల్ అడ్వైజర్ రాచకట్ల కృష్ణ ( హైకోర్ట్ అడ్వకేట్ ) , ఊరటి రవికుమార్, యాద రవి కుమార్ , చెలిమల్ల అశోక్ కుమార్ , తూనం రాము , సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ వైనాల రమేష్ , మోడెం రాజశేఖర్ గౌడ్ , నాగవెళ్ళి కార్తిక్ పాల్గొన్నారు.