వేద న్యూస్, నెక్కొండ:

నెక్కొండ మండలంలోని పనికర గ్రామ శివారులోని శ్రీ మల్లికార్జున స్వామి రేణుక ఎల్లమ్మ దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 10న (ఆదివారం)ఉదయం 10 గంటలకు పెద్దపట్నం, ఎల్లమ్మ బోనాలు మల్లన్న బోనాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు బుధవారం తెలిపారు. పరిసర గ్రామాల ప్రజలు హాజరు కావాలని కోరారు. భక్తులు తాము కోరుకున్న కోరికలు నెరవేరవడానికి బోనాలు, మొక్కులు సమర్పించుకోవాలని సూచించారు.