వేద న్యూస్, మరిపెడ: 

మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని 10, 11 వ వార్డులలో ఎస్సీ కాలనీలో బీఆ ర్ ఎస్ పార్టీ నేతలు ప్రచారం నిర్వహించారు. ఆదివారం గ్రామ దేవత ఆశీస్సులు తీసుకున్న అనంతరం గులాబీ పార్టీ నేతలు బీఆర్ఎస్ పార్టీ డోర్నకల్ ఎమ్మెల్యే అభ్యర్థి డి ఎస్ రెడ్యా నాయక్ తరఫున గడపగడపకు తిరుగుతూ ప్రచారం చేపట్టారు.

 

రెడ్యానాయక్ ను భారీ మెజారిటీతో ఎమ్మెల్యే గా గెలిపించాలని ప్రజలను కోరారు.

కార్యక్రమంలో మాజీ ఓడీ సీఎం ఎస్ చైర్మన్ కుడితి మహేందర్ రెడ్డి,పట్టణ అధ్యక్షులు ఉప్పల నాగేశ్వరరావు, 10 వ వార్డు కౌన్సిలర్ హతిరామ్,11వ వార్డు కౌన్సిలర్ పరుశురాములు,10వ వార్డు అధ్యక్షులు ఎడెల్లి ఉప్పలయ్య, మట్టే కాటయ్య, సైదులు, రవి,ఉప్పలయ్య సురేష్,కృష్ణ,గోపయ్య, ఇద్దయ్య, వెంకటేష్, వెంకన్న సత్యం, గోల్కొండ వెంకన్న , బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.