వేద న్యూస్, హైదరాబాద్ :
ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని ఆదివారం జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అందుకున్న నేపథ్యంలో మంద కృష్ణ మాదిగ తమ ఆనందాన్ని ముఖ్యమంత్రితో పంచుకున్నారు. సామాజిక న్యాయం కోసం మంద కృష్ణ మాదిగ చేస్తున్న కృషిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మరోసారి ప్రశంసించారు.