వేద న్యూస్, మిర్యాలగూడ ప్రతినిధి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన అన్ని మండలాల ఎంపీడీవోలతో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రత్యేక అత్యవసర సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ గతంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకొన (ఎల్ 1,ఎల్ 2,ఎల్3) వికలాంగులు,వితంతువులు లబ్ధిదారులుగా మంజూరు నోచుకోని వారు తిరిగి ఆగస్టు 15 లోపు ఇందిరమ్మ ఇండ్ల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారని తెలిపారు.
ఈ విషయాన్ని ఆయా మండలాల్లోని ప్రజలందరికీ అవగాహన కలిగేలా మండలాధికారులు విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు.
ఆన్లైన్ దరఖాస్తులను పరిశీలించి అర్హులను గుర్తించాలని ఎలాంటి అవకతోకలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ అవకాశాన్ని నియోజకవర్గంలోని వితంతువులు,వికలాంగులు వినియోగం చేసుకోవాలని కోరారు.