•  కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబురాలు

వేద న్యూస్, జమ్మికుంట/హుజురాబాద్:
హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి వోడితల ప్రణవ్ ఆదేశాల మేరకు హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ మహిళలు, నాయకులు, కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పధకం ద్వారా 500 లకే గ్యాస్, గృహజ్యోతి పధకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తున్న సందర్భంగా మంగళవారం నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.

గ్యాస్ బండలకు పూల దండలు వేసి, స్వీట్లు పంపిణీ చేసి సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు మాట్లాడుతూ ప్రజలకు ఆరు గ్యారెంటీ పథకాలను అందిస్తామని ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం పథకాలను అమలు చేస్తోందని చెప్పారు.

ఇప్పటి వరకు నాలుగు పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో హుజూరాబాద్ పట్టణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు యేముల పుష్పలత, మండల అధ్యక్షురాలు లంకదాసరి లావణ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు ఆలేటి సుశీల, సొల్లు సునిత, మల్లీశ్వరి, కడారి తిరుమల తదితరులు పాల్గొన్నారు.