వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
ది నేషనల్ కన్జూమర్ రైట్స్ కమిషన్ తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్ పర్సన్ డాక్టర్ అనితా రెడ్డి..లష్కర్ బజార్ లోని ప్రభుత్వ అర్బన్ రెసిడెన్షియల్ హాస్టల్ పిల్లలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చలి ఎక్కువగా ఉండటం తో పిల్లలు ఇబ్బంది పడకూడదని దుప్పట్లు అందజేశామని చెప్పారు. ఇక్కడ ఉండే పిల్లలు అంతా పేద, అనాథ పిల్లలు అని పేర్కొన్నారు.

 

పిల్లలు బాగా చదువు కోవాలని, క్రమశిక్షణ తో మంచి నడవడికతతో, ఒక లక్ష్యము పెట్టుకుని చదువును కష్టంగా కాకుండా ఇష్టంగా చదువు కోవాలని సూచించారు. అనంతరం పిల్లలకు, టీచర్స్, సిబ్బందికి వినియోగదారుల చట్టం గురించి డాక్టర్ అనితా రెడ్డి అవగాహన కల్పించారు.

ప్రతీ చట్టంపై అవగాహన అవసరం అని వెల్లడించారు. పిల్లలు చిన్నతనం నుండే వినియోగదారపు మెలకువలు నేర్చుకోవాలని స్పష్టం చేశారు. వినియోగదారులు మోసపోకుండా ఉండాలంటే ఎంత చిన్న వస్తువులను కొన్నా రశీదు తీసుకోవాలని సూచించారు.

పెద్ద వస్తువులకు రసీదు తో పాటు గ్యారంటీ కార్డు, వారంటీ కార్డు తీసుకొవాలన్నారు. అప్పుడే మనం ఏ విధంగా మోసపోయినా వినియోగదారుల కోర్టు లో కేసు వేయవచ్చు అని వివరించారు. కార్యక్రమం లో డాక్టర్ అనితా రెడ్డి, అర్బన్ రెసిడెన్షియల్ హాస్టల్ ఇన్ చార్జి దీప, శీనివాస్, ప్రసన్న కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.