వేద న్యూస్, వరంగల్:
ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కు అయిన ఎంజీఎం ఆస్పత్రిలో దారుణం జరిగింది. అప్పుడే పుట్టిన రెండు రోజుల వయసున్న శిశువును కుక్కలు చంపేసినట్టు సమాచారం. ఎంజీఎం అవుట్ పోస్ట్ వద్ద కుక్కలు నవజాత శిశువును లాక్కెళ్తుండగా పోలీసులు ఈ విషయాన్ని గమనించినట్టుగా తెలుస్తోంది.