వేద న్యూస్, వరంగల్:

ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని “ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడం” అంశం పై ఈ నెల (జూన్) 5 న, వరంగల్ లోని కాకతీయ జూలాజికల్ పార్క్ లో ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ, హన్మకొండ ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ ట్ సంయుక్త ఆధ్వర్యలో అవగాహనా కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రాద్రి, వరంగల్ క్షేత్ర ముఖ్య అటవీ సంరక్షణాధికారి డి.భీమా నాయక్ ఐ.ఫ్.ఎస్, గౌరవ అతిథిగా హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య, ఐ.ఏ.ఎస్, హన్మకొండ ఇన్ చార్జి జిల్లా అటవీ అధికారి అనుజ్ అగర్వాల్, ఐ.ఫ్.ఎస్, కాకతీయ జూపార్క్ ఎఫ్.ఆర్.ఓ. మయూరి పాల్గొని ప్రసంగాలు ఇవ్వనున్నారు.

ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా అవగాహనానిమిత్తం ఆసక్తిగల పాఠశాల విద్యార్థులకోసం చిత్రలేఖనము, వ్యాసరచన, వకృత్వ పోటీలను జూన్ 4 వ, తేది ఉదయం గం.10 నుంచిమధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు.

ప్రతిభా పాఠవ పోటీలలో గెలుపొందిన మొదటి, రెండవ విజేతలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు, పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ అందజేయబడునని హనకొండ ఫారెస్ట్ రేంజ్ అధికారిణి మయూరి, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ ఫౌండర్ ప్రెసిడెంట్ ఇందారం నాగేశ్వర్ రావు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు.

పోటీలో పాల్గొనే విధ్యార్థులు రిజిస్ట్రేషన్స్ కొరకు తమ పేర్లను ఎఫ్.ఆర్.ఓ మయూరి మొబైల్ నం. 8019919959 లేదా సంయుక్త సెక్రెటరీ, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ రవిబాబు పిట్టల మొబైల్ నెం. 9849425271 లకు కాల్ చేసి నమోదు చేసుకోని.. సకాలంలో విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని, ఈసందర్భంగా అటవీ ఛాయా చిత్రాల ప్రదర్శన ఉంటుందని అలాగే వన సేవ స్వచ్చంద సంస్థ కూడ ఈ కార్యక్రమ విజయంలో భాగస్వామ్యముంటుందని ఈ సందర్బంగా వెల్లడించారు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *