- కలెక్షన్ కింగ్స్గా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు
- అనుమతుల కోసం ప్రజలను ఇబ్బంది పెడితే ఊరుకోం
- మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్ సంచలన ఆరోపణలు
వేద న్యూస్, కరీంనగర్:
కరీంనగర్ మాజీ మేయర్ , తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్ధార్ రవీందర్ సింగ్ శనివారం పట్టణంలో మీడియా సమావేశం నిర్వహించారు. కరీంనగర్ జిల్లాలోని ఎల్ఆర్ఎస్ నిధుల దుర్వినియోగం ,అధికారుల అవినీతి పై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా రాష్ట్ర ప్రజలను , కరీంనగర్ ప్రజలను మోసం చేసి డబ్బు వసూళ్లకు కుట్రలకు పాల్పడుతుందని, జిల్లాలో ఎల్ఆర్ఎస్ కు దాదాపుగా 39వేలకు పైగా దరఖాస్తు చేసుకున్నారనీ,దీంట్లో 24వేల మందికి మున్సిపల్ అధికారులు ఫీజులు చెల్లించాలని నోటీసులు పంపించారని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 8వేలకు పైగా ఫీజులు చెల్లిస్తే కేవలం 4వేల దరఖాస్తులకు మాత్రమే ప్రోసిడింగ్ పత్రాలు ఇవ్వడం ఏమిటని? ప్రశ్నించారు.
ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ కు ప్రజలు 40 కోట్ల 69 లక్షలు రూపాయలు అందించారు కానీ, చెల్లించిన నిధులు మున్సిపల్ కార్పొరేషన్ అకౌంట్లో జమ చేయలేదని ఆరోపించారు. నగర ప్రజలు రాత్రి, పగలు ఎంతో కష్టపడిన సొమ్మును ఎల్ఆర్ఎస్ కు చెల్లిస్తే,మున్సిపల్ కార్పొరేషన్ లో కాకుండా రాష్ట్ర ప్రభుత్వ అకౌంట్లో నిధులు మళ్లించడం ఏమిటని? ప్రభుత్వ విధానాలపై తీవ్రంగా మండిపడినారు.జిల్లా కలెక్టర్ కు, మున్సిపల్ కమిషనర్ లకు ఎన్నోసార్లు కలిసి జిల్లాలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై, నిధుల మళ్లింపు పై ఫిర్యాదులు చేసినా, కేసులు పెట్టిన కూడా ఇప్పటికీ పట్టించుకోలేదని వారు వాపోయారు.
జిల్లా అధికారులు అనుమతి లేకుండా , ఏ జీవో ప్రకారం కరీంనగర్ ప్రజలు నగర అభివృద్ధి కోసం చెల్లించిన డబ్బులు హైదరాబాద్ కు ఎలా తరలించారో?చెప్పాలని ప్రశ్నించారు.కరీంనగర్ ప్రజలు ఎల్ఆర్ఎస్ కు చెల్లించిన డబ్బులు వెంటనే వాళ్ళ డివిజన్లు అభివృద్ధి కోసం మాత్రమే ఉపయోగించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారులు నగర ప్రజల డబ్బును దోచుకోవాలని కొత్తగా ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్ పొందాలంటే , ఇరిగేషన్ పర్మిషన్ తీసుకురావాలని ఆంక్షలు విధిస్తున్నారని మండిపడ్డారు.
ఇరిగేషన్ శాఖ అనుమతికి నగర ప్రజలకు సంబంధం ఏమిటని?కేవలం ప్రజలను ఇబ్బంది పెట్టాలని అధికారులు కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని అన్నారు. ఇదే కాకుండా ఇరిగేషన్ శాఖ తో పాటు రెవెన్యూ శాఖలో కూడా అనుమతి పొందాలని నగర ప్రజలకు చెప్పడం ఏమిటని? ప్రశ్నిస్తూ, నగర ప్రజల డబ్బులను దోచుకోవాలనే ఉద్దేశంతోనే దిక్కుమాలిన అనుమతులు ప్రవేశపెడుతున్నారని ఆరోపించారు.
బహిరంగంగా ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ శాఖల అనుమతుల కోసం 10-20వేల రూపాయల పైగా అధికారులు వసూళ్లు పాల్పడుతున్న, ఇంత పెద్ద అవినీతి జరుగుతున్న కనీసం ఏ ఒక్కరు కూడా నోరు మెదపడం లేదని నగర ప్రజలపై కనీస బాధ్యత లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ చట్టంలో ఎక్కడైనా ఇరిగేషన్ శాఖ పర్మిషన్ తీసుకోవాలని పేర్కొన్నారా?అని,ఆయన అధికారులను సూటిగా ప్రశ్నించారు.జిల్లాలోని టౌన్ ప్లానింగ్ అధికారులు “కలెక్షన్ కింగ్స్” గా మారారని తమ కార్యాలయాల్లో అందుబాటులో ఉండకుండా, హోటలల్లో డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
మున్సిపల్ కార్పొరేషన్ లో కేవలం “షార్ట్ ఫాల్ ” అనుమతికి కూడా వసూళ్లు చేస్తున్నారని , ఏ చిన్న పనికి అయినా ప్రతి ఒక్క అధికారి అవినీతికి పాల్పడుతున్న కూడా కనీస చర్యలు తీసుకోవడం లేదని తన ధ్వజమెత్తినారు.ఇంత పెద్ద కుంభకోణం జరుగుతుంటే జిల్లాలోని ఐఏఎస్ అధికారులు ఏం చేస్తున్నారని?, అవినీతిని అరికట్టాల్సింది పోయి,కనీస చర్యలు కూడా తీసుకోవడం లేదని, రాను రాను ప్రజలకు మీపై నమ్మకం పోతుందని అన్నారు.
వర్షాకాలంలో పురాణ ఇండ్ల కూలగొడతామని నోటీసులు ఇచ్చి , ప్రజలతో బీరాలు మాట్లాడుకుంటున్నారని,మరో కొత్త డ్రామాకు అధికారులు శ్రీకారం చుట్టారని, ఆయన ఎద్దేవా చేసినారు.స్వయంగా జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ సంతకాలతో ఇచ్చిన నోటీసులపై అధికారులు ప్రజలతో అవినీతి బేరాలకు పాల్పడుతున్న కూడా పట్టింపు లేదా? అని ప్రశ్నించారు.
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో జరుగుతున్న అక్రమాలపై త్వరలోనే ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారని , రాష్ట్రంలో కొనసాగుతున్న కాంగ్రెస్ అవినీతి నిరంకుశ పాలనకు చరమగీతం పాడుదామని! ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.కరీంనగర్ జిల్లాలో నిధుల పట్ల గోల్మాల్ జరుగుతున్న కూడా ఏ ఒక్క మంత్రి అయినా నగర ప్రజల కష్టాలను గాని!, అవినీతిపై గానీ!రివ్యూ మీటింగ్ కూడా నిర్వహించలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు.
ఎల్ఆర్ఎస్ నిధులు కేవలం నగరపాలక సంస్థ అభివృద్ధి కోసమే ఉపయోగించాలని , నగరంలో జరుగుతున్న అవినీతిపై విజిలెన్స్ ఏసీబీ విచారణ చేపట్టాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ లు ప్రత్యక్షంగా జిల్లా నగర పాలక సంస్థలో పర్మిషన్లకు స్వయంగా పాల్గొని అవినీతి భరతం పట్టాలని కోరారు.