• ఎంఆర్ పి కంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తే చర్యలు
  • తూనికల శాఖ అధికారి

వేద న్యూస్, రుద్రూర్ :

ఎంఆర్ పి ధర కంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని తూనికల శాఖ అధికారి ఎస్సై సందీప్ హెచ్చరించారు.రుద్రూర్ మండల కేంద్రంలోని పలు దుకాణ సముదాయాలను బుధవారం తూనికల శాఖ అధికారి ఎస్సై సందీప్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు.

ఏదైనా వస్తువు ఎంఆర్ పి ధరల కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే దుకాణ యజమానులపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయాని దుకాణ యజమానులకు ఆయన సూచించారు. ఈ తనిఖీలలో కానిస్టేబుల్ నరేష్ తదితరులు ఉన్నారు.