వేద న్యూస్, హైదరాబాద్:
తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ ఛైర్మన్ గా నియమితులైన జంగా రాఘవ రెడ్డి రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం హైదరాబాదులోని మంత్రి నివాసంలో కలిసి పలు అంశాలపై చర్చించారు. కాగా తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ ఛైర్మన్ గా నియమితులైన జంగా రాఘవ రెడ్డికి ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ శుభాకాంక్షలు తెలిపారు.