వేద న్యూస్, శాయంపేట:
శాయంపేట మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద పద్మశాలి కులస్తుల ఆరాధ్యుడు కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం నాయకులు నడుం బిగించారు. మండల అధ్యక్షుడు వంగరి సాంబయ్య ఆధ్వర్యంలో శుక్రవారం విరాళాల సేకరణ చేపట్టారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సెప్టెంబర్ 27న పురస్కరించుకొని విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయనున్నట్లు వారు తెలిపారు. పద్మశాలి కులస్తులందరూ తమ వంతుగా సాయం అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో శాయంపేట గ్రామ అధ్యక్షుడు బాసని ప్రకాష్,జిల్లా నాయకులు బాలకృష్ణ,
మండల యూత్ అధ్యక్షుడుబాసాని సాయి తేజ,మండల నాయకుడు చిందం రవి,దిడ్డిప్రభాకర్ ,బూరలక్ష్మీనారాయణ,గొట్టుముక్కల రమేష్,రంగు మహేందర్,సామల బిక్షపతి,తుమ్మ ప్రభాకర్ ,కందగట్ల గోపాల్
తదితరులు పాల్గొన్నారు.