వేద న్యూస్, కొత్తకొండ/ఎల్కతుర్తి:
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్ర స్వామి వారి దర్శనానికి వచ్చిన మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ తో మంత్రి పొన్నం ప్రభాకర్ ముచ్చటించారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, హుస్నాబాద్ నియోజకవర్గ నాయకులు, వృక్ష ప్రసాద దాత జేఎస్ఆర్ ‘వృక్ష ప్రసాద’ పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన అనంతరం ఈటల నాయకులతో కలిసి వీరన్నను దర్శించుకున్నారు. ఈ క్రమంలో బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. ఈటల రాజేందర్, జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి(జేఎస్ఆర్) ఇతర నాయకులతో మాట్లాడారు.
