వేద న్యూస్, వరంగల్ టౌన్:
ఇరుగుపొరుగు..గ్రామాలు పట్టణాలు జిల్లాలు..రాష్ట్రాలతో పాటు..దేశాలు దాటి..ప్రేమ వివాహాలు సాగుతున్నాయి. విద్య కోసం..ఉద్యోగ జీవనం కోసం.. విదేశాలకు వెళుతున్న..భారతీయ యువత అక్కడి అమ్మాయిలతో మనసులు పంచుకుంటూ పెద్దలను ఒప్పించి మన స్వదేశంలో మన భారతీయ పద్ధతిలో అత్యంత ఘనంగా వివాహ వేడుకలు నిర్వహించుకుంటున్నారు.
వరంగల్ పోచమ్మ మైదానికి చెందిన డాక్టర్ అశోక్ సునీతల కుమారుడైన రితేష్ అమెరికాలోని పిట్స్ బర్గ్ చెందిన జూలీయాన్ అమ్మాయితో గురువారం వెంకటేశ్వర గార్డెన్లో ప్రేమ వివాహాన్ని అత్యంత ఘనంగా బంధుమిత్రులు కుటుంబ సమేతంగా నిర్వహించారు.
మన వివాహ తంతును అమెరికా అమ్మాయి కుటుంబ సభ్యులు ఆధ్యాంతం ఆనందంగా.. జరుపుకోవడం పెళ్లికి విచ్చేసిన అందర్నీ ఆకట్టుకుంది.

