వేద న్యూస్, వరంగల్/ధర్మసాగర్:
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం దేవునూరు గ్రామం అభయ ఆంజనేయస్వామి దేవాలయంలో సోడశపల్లి వాస్తవ్యుడు, జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి 62 జన్మదినం సందర్భంగా ఆంజనేయ స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరంగల్ జిల్లా ముద్దుబిడ్డ, రైతు సమన్వయ సమితి నాయకుడు రాజేశ్వర్ రెడ్డి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని భగవంతుని ప్రార్థించినట్టు నాయకులు పేర్కొన్నారు.
మాజీ BRS మండల పార్టీ అధ్యక్షులు గుడివెనుక దేవేందర్ ,పల్లా అభిమానులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎతున్న పాల్గొన్నారు.


