• ‘స్వచ్ఛతా హీ సేవా’ కార్యక్రమంలో భాగంగా..
  •  ప్లాస్టిక్ నియంత్రణపై అవగాహన

వేద న్యూస్, కరీంనగర్:
జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఎన్ఎస్ఎస్ (జాతీయ సేవా పథకం ) ఆధ్వర్యంలో కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.ఓదేల కుమార్ అధ్యక్షతన స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా ఎన్ఎస్ఎస్ వలంటీర్లు ప్లాస్టిక్ నియంత్రణ పై భారీ ర్యాలీని నిర్వహించారు. కాలేజీ నుండి రైల్వేస్టేషన్ వరకు ర్యాలీని చేపట్టారు. ‘‘ప్లాస్టిక్ ను నిషేధిస్తాం – పర్యవరాన్ని కాపాడు కుందాం’’ అంటూ ప్లకార్డులు చేత పట్టుకొని నినాదాలు చేశారు. రైల్వేస్టేషన్ సమీపంలో పరిశుభ్రత కార్యక్రమం చేపట్టారు.

ప్లాస్టిక్ బాటిళ్ల ను, చెత్త చెదారం తొలగించారు. ఈ సందర్భంగా కళాశాల ఇన్ చార్జి ప్రిన్సిపాల్ ఓదేలు కుమార్ మాట్లాడుతూ నిత్య జీవితం లో భాగంగా మారిన ప్లాస్టిక్ ను అరికట్టాలన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. పర్యావరణానికి ప్రమాదకరంగా ఉన్న ప్లాస్టిక్ భూతాన్ని తరిమికోట్టాలన్నారు. ఆరోగ్యకరమైన జీవనం గడుపుదామని సూచించారు.

ఈ కార్యక్రమం లో కళాశాల ఆకాడమిక్ కోర్డినేటర్. డాక్టర్. రాజేంద్రం, ఎన్ఎస్ఎస్ ప్రోగాం. అఫీసర్లు డాక్టర్. ఈ. రవి, ఎల్.రవీందర్, అధ్యాపకులు డాక్టర్ రాజ్ కుమార్ ఉమా కిరణ్, వి. కిరణ్ కుమార్, డాక్టర్ రవి ప్రకాశ్, డాక్టర్ శ్రీనివాస్, అరుణ్ రాజ్, శ్రీనివాస్, సాయి, శ్రీకాంత్, వలంటీర్లు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.