• స్వచ్ఛ ఆటో ఓనర్ కం డ్రైవర్ విజయ్

వేద న్యూస్, వరంగల్ టౌన్ :

పెండింగ్ లో ఉన్న నాలుగు నెలల వేతనాలు చెల్లించాలంటూ స్వచ్ఛ ఆటో కార్మికులు విధులు బహిష్కరించి వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట స్వచ్ఛ ఆటోలతో ఆందోళన దిగారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 169 స్వచ్ఛ ఆటోలు 66 డివిజన్ ల నుంచి చెత్త సేకరిస్తున్నాయి. నాలుగు నెలల నుండి స్వచ్ఛ ఆటో కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు ఆందోళన చేపట్టారు. కార్పొరేషన్ అధికారుల తీరు పట్ల ఆగ్రహ వ్యక్తం చేశారు.

సమయానికి వేతనాలు ఇవ్వకపోవడంతో బ్యాంకు లోన్ ఆలస్యమై ఇతర లోన్లు రావడంలేదని, గతంలో ఇంటికి రూ.60 రూపాయల చెత్త పన్ను వసూలు చేసిస్తామన్న అధికారులు ఇప్పటివరకు అది పట్టించుకోవడంలేదని ఆరోపించారు.

తమకు ఇచ్చిన ఆటోల మెయింటెనెన్స్ భారంగా మారిందని తాము ఇక స్వచ్ఛ ఆటోలు నడిపే పరిస్థితి లేదని కార్పొరేషన్ అధికారులు కేవలం 169 మంది ఆటో డ్రైవర్ కం ఓనర్లు అనుకుంటున్నారే తప్ప 169 కుటుంబాలు గా పరిగణంలోకి తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పెండింగ్లో ఉన్న వేతనాలు తక్షణమే చెల్లించాలని అప్పటివరకు ఆటోలు తీసేది లేదని కార్మిక సంఘం నాయకులు తెలిపారు.